గంటపాటు ఫ్లైట్ ఆలస్యం.. పైలట్ పై ప్రయాణికుడి దాడి

-

ఇటీవల విమానాల్లో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొంతమంది తోటి ప్రయాణికులు, సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పొగమంచు కారణంగా ఈ విమాన ప్రయాణానికి అంతరాయం ఏర్పడగా గంటపాటు ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఫ్లైట్లో ఉన్న ఓ ప్రయాణికుడు కోపంతో ఊగిపోతూ పైలట్‌ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు. ఈ ఘటనపై ఇండిగో ఫిర్యాదు చేసింది. ప్రయాణికుడిని విమానం నుంచి దించేసి.. భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఈ ఘటనపై తోటి ప్రయాణికులు స్పందిస్తూ.. “విమానం 13 గంటల ఆలస్యమైంది. ‘విమానం ఆలస్యానికి అందులోని సిబ్బంది ఏం చేస్తారు..? వెంటనే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి, నో ఫ్లై లిస్ట్‌లో చేర్చండి’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో పొగమంచు కారణంగా రెండ్రోజుల నుంచి వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news