Jammu Kashmir: ఉగ్రవాదుల దురాగతం.. బ్యాంకు మేనేజర్ పై కాల్పులు

-

కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మరోసారి హైబ్రిడ్ టెర్రరిజానికి మరో పౌరుడు గాయపడ్డారు. తాజాగా కాశ్మీర్ లోని కుల్గామ్ లో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా వద్ద ఉన్న ఎల్లకీ దేహతీ బ్యాంకులో బ్యాంకు మేనేజర్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర ఘాతుకంలో మేనేజర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయన చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. బాధిత వ్యక్తి రాజస్తాన్ లోని హనుమాన్ ఘర్ నివాసి. ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా టార్గెట్ దాడులు చేస్తున్నారు టెర్రరిస్టులు. నిన్న షోఫియాన్ జిల్లా కేగామ్ లో ఫారఖ్ అహ్మద్ షేక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగారు. అంతకుముందు వారం కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ కాల్చిచంపారు. ఇటీవల హిందూ మహిళా టీచర్ ను కూడా కాల్చి చంపారు టెర్రిరిస్టులు. అమ్రీన్ భట్ ను కాల్చి చంపిన టెర్రిరిస్టులను 24 గంటల్లోనే మట్టుపెట్టాయి భద్రతా మట్టుపెట్టాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news