BREAKING : ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి పేరు ప్రకటన..చెరో రెండున్నరేళ్లు పదవీ

-

BREAKING : ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి పేరును ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ తరుణంలోనే ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. సిద్ధరామయ్య, డికే శివకుమార్ లతో హై కమాండ్ చర్చలు నిర్వహించనుంది. ఇద్దరికీ న్యాయం చేసే ఫార్ములా పై ఇవాళ ఢిల్లీలో మంతనాలు జరుగనున్నాయి.

చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైందని సమాచారం. అటు కర్ణాటక ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఖర్గే కు అందజేశారు అబ్జర్వర్లు. మరి మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవీని సిద్ధరామయ్యకు, మరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవీ డీకే శివకుమార్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఎవరికీ కట్టబెట్టనుందని తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news