బాబాయ్ X అబ్బాయ్​.. వేర్వేరుగా భేటీ.. ఎమ్మెల్యేల బ‌లమెంతో తేల్చుకోనున్న ఇరువర్గాలు?

-

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  మహారాష్ట్ర ఎన్​సీపీలో శరద్‌ పవార్‌, అజిత్ పవార్ వర్గాలు.. ఇవాళ తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో.. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశాయి.

శరద్‌ పవార్‌ నేతృత్వంలో వైబీ చవాన్‌ సెంటర్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్​కు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా రావాలని శరద్‌ పవార్ వర్గం నేత జితేంద్ర అవహద్‌ విప్ జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, అజిత్‌ పవార్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్స్​, వర్కింగ్ కమిటీ సభ్యులు తప్పినసరిగా హాజరు కావాలని ఎన్​సీపీ బహిష్కృత నేత సునీల్ తత్కరే నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news