బ్రేకింగ్:నీట్ వాయిదా వేసేది లేదు, సుప్రీం స్పష్టం…!

-

జేఈఈ, నీట్ పరీక్షలను 2020 వాయిదా వేయాలని కోరుతూ, అలాగే ఆగస్టు 17 న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 6 ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల కేబినెట్ మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. బిజెపి పాలన లేని రాష్ట్రాల నుండి 6 మంది క్యాబినెట్ మంత్రులు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. , పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌ గడ్, జార్ఖండ్, మరియు మహారాష్ట్ర.

గత నెల 28న ఈ పిటీషన్ దాఖలు చేసారు. పశ్చిమ బెంగాల్ (మోలోయ్ ఘటక్), జార్ఖండ్ (రామేశ్వర్ ఒరాన్), రాజస్థాన్ (రఘు శర్మ), ఛత్తీస్‌గడ్ (అమర్‌జీత్ భగత్), పంజాబ్ (బిఎస్ సిద్దూ), మహారాష్ట్ర (ఉదయ్ రవీంద్ర సావంత్) మంత్రులు ఈ సమీక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆగస్టు 17 న, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) ను వాయిదా వేయాలని కోరిన పిటీషన్ ని కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news