ఆసుపత్రి నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జ్

-

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ లోని ఎయిమ్స్ చేరిన విషయం తెలిసిందే. 63 ఏళ్ల నిర్మల రొటీన్ హెల్త్ చెకప్ తో పాటు స్వల్ప కడుపు నొప్పితో సోమవారం ఢిల్లీలోని ఏం ఆస్పత్రిలో చేరి నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. అలాగే సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో గురువారం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా నిర్మల సీతారామన్ బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 1న ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news