2014లో మోడీ గెలిచాడు..2024లో ఓడిపోతాడు – సీఎం నితీష్‌ సంచలనం

-

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. బీహార్‌ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ప్రసంగంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం నితీష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో మోడీ గెలిచాడు..2024లో ఓడిపోతాడని సీఎం నితీష్‌ కుమార్‌ బాంబ్‌ పేల్చాడు.

2024 ఎన్నికల సమయం వరకు ప్రతి పక్షాలు అన్ని ఏక తాటిపైకి వచ్చి.. మోడీని ఓడిస్తాయని హెచ్చరించారు. తన సీఎం పదవి ఎప్పుడు ఊడుతుందో తెలీదని.. అంతా బీజేపీ చేతిలోనే ఉందని మరో వివాదస్పద కామెంట్ చేశారు. మొత్తానికి మోడీ యుద్దానికి నితీష్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా.. నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news