ప్రజల మదిలో నిలిచిపోయేలా ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్

-

తొమ్మిదేళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ త్వరలో 100వ ఎపిసోడ్ కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రజల మనసులో నిలిచేలా మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మన్‌ కీ బాత్‌ను అత్యధిక మంది వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీని ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామని.. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానాన నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏప్రిల్‌ 30న నిర్వహించబోయే మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ను కన్నుల పండగ వాతావరణంలో నిర్వహించాలని బండి సంజయ్ రాష్ట్ర కాషాయ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో.. ప్రతి నియోజక వర్గంలో కనీసం 100 కేంద్రాల్లో సగటున 100 మంది హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రజలందరూ మన్‌ కీ బాత్‌ చూసేలా స్క్రీన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని చెప్పారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని శ్రేణులకు బండి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news