రాష్ట్రానికి చుక్కలు చూపించిన కిల్లర్ ని లేపేసిన పోలీసులు

-

మధ్యప్రదేశ్‌ లోని రత్లాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో పోలీసులు సైకో కిల్లర్ ని కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్ లో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గుజరాత్‌లోని దాహోద్ నివాసి అయిన దిలీప్ దేవాల్ పలు రాష్ట్రాల్లో హత్య కేసులను ఎదుర్కొంటున్నాడు. రత్లాంలో, నవంబర్ 25 న ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకుంటూ బిజీగా ఉన్న సమయంలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు – ఒక భర్త, అతని భార్య మరియు కుమార్తెను వారి ఇంట్లోనే కాల్చి చంపాడు.

ఈ హత్యలు అన్నీ కూడా ఒక మిస్టరీగా జరిగాయి. ఆ రాత్రి ఫైర్‌ క్రాకర్ శబ్దాల కవర్‌ ను ఉపయోగించి చంపేశారు. జూన్‌ లో ఒక మహిళను హత్య చేసినట్లు కూడా దేవాల్‌ పై ఆరోపణలు ఉన్నాయి. దొంగతనం కోసం అతను వెళ్ళాడు అని కాని ఆ సమయంలో అతనికి వారి నుంచి తిరుగుబాటు వచ్చింది అని అందుకే వారిని చంపాడు అని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news