BREAKING : ఇవాళ కరోనాపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం

-

BREAKING : ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ కరోనా మహమ్మారి నివారణపై ప్రధాని మోడీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఎదుర్కొనేందుకు కావాల్సిన సన్నద్ధత పై సమీక్ష చేయనున్నారు ప్రధాన మంత్రి మోడీ. కాగా.. ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1134 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,98,118 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news