అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

-

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి పెట్టారు.. ఆ డబ్బు అదాని ది కాదు. అది ఎవరిదో చెప్పాలని అడిగానన్నారు.

అదానీ-ప్రధాని మోడి సంబంధంపై సమగ్రంగా మాట్లాడాను… గుజరాత్ ముఖ్యమంత్రి గా మోడి ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయంపై నేను పార్లమెంటులో మాట్లాడితే, రికార్డుల నుంచి తొలగించారని ఆగ్రహించారు. విమానాశ్రయాలను అదానీకి గంపగుత్తగా అప్పగించారని..ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేశారని నిప్పులు చెరిగారు. పార్లమెంటులో నా గురించి మంత్రులు అనేక ఆరోపణలు చేశారు…పార్లమెంట్‌లో ఒక సభ్యుడిపై ఆరోపణలు చేసినప్పుడు వాటికి జవాబు ఇచ్చే హక్కు ఆ సభ్యుడిగా ఉంటుందన్నారు. ఆ ప్రకారమే నేను స్పీకర్‌ను నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కోరాను. కానీ అవకాశం ఇవ్వలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news