IPL 2023 : RCB ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు వెళ్లిన ముంబై

-

IPL 2023 టోర్నీ నుంచి బెంగళూరు జట్టు వైదొలిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో RCB ఓటమి పాలైంది. RCB నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని GT 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

గుజరాత్ బ్యాటర్లలో గిల్(104*) సెంచరీతో అదరగొట్టగా, విజయశంకర్ 53 పరుగులతో రాణించారు. RCB ఓడిపోవడంతో 16 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈసారైనా ఛాంపియన్ గా నిలవాలి అనుకున్న RCB నిరాశే ఎదురయింది. అటు కోహ్లీ సెంచరీతో రాణించినా.. ఫలితం లేకుండా పోయింది.

ఇక గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులకు RCB ఆటగాళ్లు ధన్యవాదాలు తెలిపారు. గ్రౌండ్ మొత్తం తిరుగుతూ తమకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం GT యంగ్ ప్లేయర్లకు విరాట్ కోహ్లీ పలు సలహాలు ఇచ్చారు. రషీద్ ఖాన్… జెర్సీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ వీడియోను ఐపీఎల్ యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news