బిజెపిపై రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

-

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీ పై సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయపూర్ హత్య కేసు నిందితుల్లో ఒకరికి బి.జె.పి తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.” ఉదయపూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది.

అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలు పెట్టక ముందే బిజెపి కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు అన్నారు” అని అశోక్ గెహ్లాట్ అన్నారు. హత్య కేసు నిందితుడు పై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ ఆరోపనలపై బిజెపి వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news