‘ద కేరళ స్టోరీ’ విడుదలపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

-

కేరళ కథ : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ముఖ్యంగా కేరళ రాజకీయాల్లో ద కేరళ స్టోరీ మామూలు ప్రకంపనలు సృష్టించలేదు. ఈ సినిమాపై ఓవైపు అధికార పక్షం.. మరోవైపు ప్రతిపక్షం.. అందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయని.. అందువల్ల ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

 

కేరళ కథ
కేరళ కథ

తాజాగా ‘ద కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషనుపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వచ్చే శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ 1.60 కోట్ల వ్యూస్‌ సాధించినట్లు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, మరో న్యాయవాది నిజాం పాషా మంగళవారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని నిజాం పాషా పేర్కొన్నారు.

‘‘ద్వేషపూరిత ప్రసంగాల్లో పలు రకాలు ఉంటాయి. ఈ సినిమాకు సెన్సార్‌బోర్డు సర్టిఫికెటు ఇచ్చింది. కాబట్టి, దీన్ని వ్యక్తిగత ప్రసంగం కింద పరిగణించలేం. ఒకవేళ మీరు సినిమా విడుదలను సవాలు చేయదలచుకుంటే తగిన వేదిక మీద సెన్సార్‌ సర్టిఫికెటును సవాలు చేయాలి’’ అని న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news