కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో అత్యాచారం చేయించిన భర్త

-

రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది.పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదన్న కోపంతో భర్త అత్యంత దురాగతానికి పాల్పడ్డాడు.ఇష్టంతో పెళ్లి చేసుకున్న భార్యపై బంధువులతో అత్యాచారం చేయించి దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్డ్ చేశాడు.ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో వెలుగుచూసింది.భరత్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి హర్యానాకు చెందిన మహిళను 2019 లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.వివాహం సందర్భంగా అత్తింటి వారు అల్లుడికి ఇస్తానన్న రూ.1.5 లక్షల కట్నం ఇవ్వలేదు.దీంతో అత్తింటివారు కట్నం కోసం కోడలిని తరచూ వేధిస్తుండేవారు.రోజూ గొడవలు జరుగుతూ ఉండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ క్రమంలో భార్య దగ్గరకు వెళ్లిన భర్త..ఏవో మాయమాటలు చెప్పి ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు.ఆ తరువాత తన సమీప బంధువులు ఇద్దరిని పిలిచాడు.అనంతరం వారితో తన భార్యపైనే అత్యాచారం చేయించాడు.ఘటనను భర్తే తన ఫోన్లో రికార్డు చేశాడని పోలీసులు తెలిపారు.కుటుంబ సభ్యులు తనకు కట్నం ఇవ్వలేకపోయారు..కానీ ఇప్పుడు ఈ అశ్లీల వీడియోను యూట్యూబ్ లో పెట్టి డబ్బులు సంపాదిస్తా అంటూ ఆ వీడియోను తన భర్త యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news