పెళ్లయిన కొన్ని గంటలకే పెళ్లికూతురు పరార్!

-

పెళ్ళయిన కొన్ని గంటలకే వధువు పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో జరిగింది.అలీగడ్ కు చెందిన ఖుషీ రామ్ కు వయసు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు.ఈ క్రమంలో గోవింద్ పూర్ కు చెందిన బంటి అనే వ్యక్తి ఖుషి రామ్ కుటుంబాన్ని కలిశాడు.ఖుషి రామ్ కు అమ్మాయిని వెతికి పెడతానని చెప్పాడు.ఏప్రిల్ 24న ఆగ్రాలోని ఓ హోటల్లో పెళ్ళి చూపులు ఏర్పాటు చేశాడు.ఓకే అయితే అదే రోజు పెళ్లి చేసేద్దామని బంటి చెప్పాడు.ఇందుకు ఖుషి రామ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.ఉదయం పెళ్లిచూపులు కాగా, అదే రోజు రాత్రి అక్కడే పెళ్లి జరిగింది.అంతా కలిసి వరుడు ఇంటికి వెళ్లారు.

పెళ్లి సమయంలో వధువు కుటుంబం దగ్గర నుంచి రూ.లక్షన్నర నగదు, చీరలు, ఆభరణాలు తీసుకుంది.అయితే పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం నవ దంపతులు కోర్టుకు వెళ్లారు.ఆ సమయంలో బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పిన వధువు ఎంతసేపటికీ రాలేదు.మిగిలిన వారు కూడా కనిపించలేదు.దీంతో తాము మోసపోయినట్లు వరుడి కుటుంబానికి అర్థమైంది.పెళ్లి కుదిర్చిన బంటి ని సంప్రదించారు.హోటల్ కు వస్తే డబ్బులు తిరిగి ఇప్పిస్తానని అతడు చెప్పాడు.కానీ రాలేదు..దీంతో వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news