రియా పిటిషన్ పై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ

-

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. అతడి మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. బిహార్​లోని పట్నాలో తనపై దాఖలైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై ఆగస్టు 5న విచారణ జరగనుంది. సుశాంత్‌ సింగ్ బలవన్మరణానికి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌సింగ్ తండ్రి పట్నాలో కేసు నమోదు చేశారు. దీనిపై సుప్రీంకు వెళ్లిన రియా ఆ కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరారు.

hicourt
hicourt

జస్టిస్​ హృషికేశ్​ రాయ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్​లో వాదనలు విననుంది.అయితే ఈ కేసులో ఏదైనా నిర్ణయాన్ని వెల్లడించే ముందు తమ వాదనలు కూడా వినాలని మహారాష్ట్ర పోలీసులు, బిహార్‌ పోలీసులతో పాటు సుశాంత్‌సింగ్ తండ్రి కూడా సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.నటుడు.. సుశాంత్​ జూన్​ 14న ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ఈ కేసులో వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు సినీ ప్రముఖుల్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news