క్రికెట్ అభిమానులకు aLERT…నేడు IPL రిటెన్షన్ షో

-

ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఐపీఎల్ వేలం సమీపిస్తున్న కొద్ది రసవత్తరంగా మారుతోంది. ఇంకా ఇవాల్టి నుంచి ఆటగాళ్ల రిటెన్షన్ కు గడువు ముగియనుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4:00 నుంచి 6 గంటల వరకు స్టార్ స్పోర్ట్స్ లో రిటెన్షన్ షో స్ట్రీమింగ్ కానుంది.

ఏ ఏ జట్లు ఏ ఏ ఆటగాలను రిటైన్ చేస్తుందో ఈ షో లో తెలుసుకోవచ్చు. కాగా ఇప్పటికే ఐపీఎల్ మినీ వేళానికి 590 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 19 వ తేదీన దుబాయిలో వేలం జరుగనుంది.

కాగా…ఇంగ్లాండ్ కీలక ప్లేయర్ జో రూట్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు వచ్చె ఏడాది ఐపీఎల్ ఆడట్లేదని తెలిపారు. “మేము అతడి నిర్ణయాన్ని గౌరవిస్తాం. రూట్ అనుభవం గతేడాది జట్టుకు బాగా ఉపయోగపడింది. అతడి కెరీర్ బాగా కొనసాగాలని కోరుకుంటున్నా” అని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ సంగక్కర తెలిపారు. రూట్ ను గతేడాది రూ. కోటి బేస్ ప్రైస్ కి RR తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version