డైపర్లు మార్చినట్లు రాజకీయ నాయకులు పార్టీలు మార్చేస్తున్నారు – వెంకయ్య నాయుడు

-

డైపర్లు మార్చినట్లు రాజకీయ నాయకులు పార్టీలు మార్చేస్తున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

చిన్న పిల్లల డైపర్ లు మార్చినట్లు రాజకీయ నాయకులు పార్టీ లు మార్చేస్తున్నారని ఆగ్రహించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పొద్దున ఉన్న పార్టీ లో సాయంత్రం వరకు ఉంటారో లేదో తెలియడం లేదని చురకలు అంటించారు. నమ్మిన సిద్ధాంతం కు కట్టుబడి ఉండే వాళ్లే రాజకీయాల్లో కి రావాలని కోరారు. యువత కు రాజకీయ పాటశాలలో శిక్షణ కావాలి…బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల పని పోలింగ్ బూతు లోనే తేల్చాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news