బ్రేకింగ్: ఏపీకి కొత్త ఎన్నికల కమీషనర్

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి ఇప్పుడు రమేష్ కుమార్ ని ఎన్నికల సంఘం అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా అంగీకరించే పరిస్థితి కనపడటం లేదు. హైకోర్ట్ తీర్పుతో తాను తిరిగి బాధ్యతలు చేపడుతున్నట్టు ఒక సర్క్యులర్ కూడా ఆయన జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే రాష్ట్ర ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఎం చెయ్యాలా అనే దాని మీద కసరత్తులు చేస్తుంది ఏపీ సర్కార్. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కమీషనర్ పదవి దాదాపుగా ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. కనగరాజ్ కూడా హైకోర్ట్ తీర్పుతో పదవి కోల్పోయారు.

దీనితో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ఆలోచన చేస్తుంది ఏపీ సర్కార్. హైకోర్ట్ తీర్పుని సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది ఏపీ సర్కార్. హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్ట్ స్టే ఇస్తే మాత్రం కొత్త కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించేలా కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రమేశ్‌కుమార్‌ మళ్లీ కమిషనర్‌ గా ఉండకూడదు అని ఏపీ సర్కార్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news