ఏపీ సర్కార్ కు ఎన్జీటీ వార్నింగ్ !

-

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలన చేసింది. అయితే దీనిపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కు ఆంధ్ర ప్రదేశ్ పాల్పడినట్లు అర్థం అవుతోంది’’ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది.

ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా ? అని పేర్కొంది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా ? లేక హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా ? అని కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్జీటీ. ఈ మేరకు ఇరు పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది ఎన్జీటీ. అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదన్న ఎన్జీటీ.. పర్యావరణ శాఖతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని అభిప్రాయపడిందని వెల్లడించింది. కాగా ఇటీవలే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కెఆర్ఎంబి పరిశీలించిన సంగతి తెల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news