నేటి అర్ధరాత్రి నుంచి టోల్ బాదుడు.. క్లారిటీ ఇచ్చిన NHAI

-

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్‌ ఛార్జీలు నేటి అర్ధరాత్రి(జూన్‌ 3) నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్ఐఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ ఛార్జీలు పెరగనున్నాయి.

టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఎన్‌హెచ్ఐఏ వెల్లడించింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్టు ,సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు ఈ మేరకు తెలిపింది.ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version