అపార్ట్‌ మెంట్‌ ఖాళీ చేస్తున్న నిహారిక

-

అపార్ట్‌ మెంట్‌ లో జరిగిన గొడవ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు నిహారిక భర్త చైతన్య. అపార్ట్‌ మెంట్‌ వారిపై ముందుగానే తానే ఫిర్యాదు చేశానని… మీడియాలో తన పై మొదట కేసు నమోదైనట్లు వస్తుందని పేర్కొన్నారు. 25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశానని..తాను అపార్ట్‌ మెంట్‌ రెంటుకు తీసుకున్న పర్పస్ మా ఓనర్ కు తెలియజేశానన్నారు చైతన్య.

ఆ విషయం అపార్ట్‌ మెంట్‌ వాసులకు క్లారిటీ లేకపోవడం కారణంగానే గొడవ జరిగిందని చెప్పారు. ఇరువురం మాట్లాడుకుని చర్చించుకున్నామన్నారు. ఫ్లాట్ యజమాని అడిగి కమర్షియల్ ఆఫీస్ గా కావాలని అద్దెకు తీసుకున్నామని…దీని వల్ల మిగితా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందంటూ వచ్చి గొడవ చేశారని పేర్కొన్నారు చైతన్య. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నామని..ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 10న అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని ప్రకటించారు నిహారిక భర్త చైతన్య.

Read more RELATED
Recommended to you

Latest news