తల్లి కోసమైనా ఆ సినిమా చేస్తానంటున్న నిఖిల్..!!

-

ఇటీవల కాలంలో కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైలెంట్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్న నిఖిల్ మరొక్కసారి కార్తికేయ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ హీరోగా నిలబడ్డారు. ఇక ఈయన కెరియర్ లో అత్యంత బ్లాక్ బాస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం కార్తికేయ 2 అని మాత్రమే చెప్పవచ్చు. ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూలను సాధించి , అరుదైన రికార్డు సృష్టించింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా ఘన విజయం సాధించింది. ఇక కార్తికేయ 3 కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే కార్తికేయ 3 పై నిఖిల్ స్పందించడం జరిగింది.. ముందు కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు అంటే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకుంటున్నారని అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. త్వరలోనే కార్తికేయ 3 తో కచ్చితంగా వస్తాను అని తెలిపారు. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ.. మా అమ్మ మాత్రం నన్ను వదలదు. కనీసం అమ్మ కోసం అయినా ఈ సినిమా చేయాలి అని ఆయన చెప్పుకొచ్చారు.

Tollywood star Nikhil Siddharth attends DEAR MOM Mothers Day Celebrations at Taj Krishna, Hyderabad
అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు విషయంపై మాట్లాడుతూ. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే బాగుంటుంది . కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు.. మాకు ప్రేక్షకుల అభిమానాలు అన్నిటికంటే ముఖ్యం అవే గొప్పవి అని ఆయన తెలిపారు. . మొత్తానికి కార్తికేయ 3 కోసం ఎదురుచూసే వాళ్ళకి శుభవార్త అందిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news