కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయం – ఈటెల రాజేందర్

-

కెసిఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ కెసిఆర్ ప్రలోభాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో కేసీఆర్ కుట్రలు పనిచేయవన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కెసిఆర్ ది అని మండిపడ్డారు. కెసిఆర్ అనాలోచిత నిర్ణయాలత గిరిజన రైతులు, నిరుద్యోగులు, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

కెసిఆర్ ఇలాఖాలో గిరిజనులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని.. గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు సంతోషంగా లేరన్నారు. కెసిఆర్ ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను అంగట్లో సరుకుల లాగా కొంటున్నారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజానీకం బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కెసిఆర్ కు నిజాయితీ ఉంటే మునుగోడు లోని గ్రామాలలో తిరగాలని సవాల్ విసిరారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news