ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం..బస్టాండ్లలో ఇకపై ఉచితంగా ఇంటర్నెట్‌

-

ఏపీ ప్రయాణికులకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ. ఏపీలోని బస్టాండ్లలో ఇకపై ఉచితంగా ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ. ఆర్టీసీలో ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులతో పాటు బస్టాండ్ లో ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు చైర్మన్ మల్లికార్జున రెడ్డి చెప్పారు.

ఆర్టీసీ పాలకమండలి సమావేశం విజయవాడలో జరగగా, పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎండి ద్వారకా తిరుమలరావు, జోనల్ చైర్మన్ లు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాదిలో రెండు దఫాలు పెంచిన చార్జీలు, అద్దెకు తీసుకున్న బస్సులు, కొత్తగా బోర్డు సభ్యుల నియామకం వంటి నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఆర్టీసీ స్థలాలు లీజుపై అధికారులు తీసుకున్న నిర్ణయాలకు బోర్డు ఓకే చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version