క్షిపణి ప్రయోగంతో అమెరికా, దక్షిణ కొరియాలకు ‘కిమ్’ వార్నింగ్

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు ఎప్పుడూ తీవ్రంగానే ఉంటాయి. తాజాగా ఆయన అమెరికా, దక్షిణ కొరియాలకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఉత్తర కొరియా.. దక్షిణ కొరియా సముద్రం వైపు ఏకంగా 10 బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులను దక్షిణ కొరియా సైనిక అధికారులు అంగీకరించారు. అప్రమత్తమైన ప్రభుత్వం తీర ప్రాంత వాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అంతకుముందు తమపై దండయాత్ర జరపాలనే దురుద్దేశంతోనే అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలకు పాల్పడుతున్నాయనీ, దీనికి తమవైపు నుంచి శక్తిమంతమైన ప్రతి చర్యలు ఉంటాయని ఉత్తర కొరియా విదేశాంగశాఖ హెచ్చరించింది. ఆ ప్రతిచర్యలు ఏంటో వివరించకపోయినా, 2017 సెప్టెంబరు తరవాత తొలి అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

కొవిడ్‌కు తోడు.. ఉత్తర కొరియాతో దౌత్య సంప్రదింపులకు అనుకూల వాతావరణం ఏర్పరచాలన్న తలంపు వల్ల కొన్నేళ్లుగా అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపేశాయి. అయితే ఉత్తర కొరియా ఈ ఏడాది 40 క్షిపణి పరీక్షలు జరపడంతో తమ విన్యాసాలను మళ్లీ ప్రారంభించాయి. సెప్టెంబరు నుంచి ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను ముమ్మరం చేయడంతోపాటు.. దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికాలపై అణు క్షిపణులను ప్రయోగించేందుకు ముందస్తు కసరత్తు కూడా చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news