క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసు.. ప్రవీణ్ మొబైల్​లో మహిళల న్యూడ్ వీడియోలు

-

టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ప్రవీణ్​ను కస్టడీకి తీసుకోని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌ 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ విభాగంలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో వెరిఫికేషన్‌ విభాగానికి వచ్చే మహిళల చరవాణి నంబర్లను నిందితుడు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు.

పలువురు మహిళలతో ప్రవీణ్​కు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి మొబైల్​లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్‌ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, దృశ్యాలు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్‌ అయిందని పోలీసులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news