తమిళనాడులో సంచలనం రేపుతున్న క్షుద్ర పూజల ఘటన

-

తమిళనాడులో క్షుద్ర పూజల ఘటన సంచలనం రేపుతుంది. క్షుద్ర పూజల కోసం బాలిక తలను తీసుకెళ్ళాడు ఓ మాంత్రికుడు. ఒళ్లు గగుర్పాటు కి గురిచేస్తున్న ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం గ్రామంలో చోటు చేసుకుంది. ఈనెల ఐదువ తేదినా పాండియన్ కుమార్తె కృతిక కరెంట్ ఫోల్ విరిగి పడటంతో బాలిక మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. మృతి చెందిన బాలిక మృతదేహాన్ని శ్మశానంలో ఖననం చేశారు కుటుంబ సభ్యులు.

అయితే ఇటీవల స్మశానంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను చూసి స్థానికంగా ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఈనెల 25న అమావాస్య నేపధ్యంలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేశాడు ఓ మాంత్రికుడు. ఖననం చేసి ఉన్న బాలిక తల నరికి తలను తీసుకెళ్ళాడు మాంత్రికుడు. ఈ విషయాన్ని పాండియన్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు స్థానికులు. పాండియన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తలని ఎవరు తీసుకెళ్లారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news