Breaking : ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఘటన.. మరో ఆడియో లీక్‌..

-

మొయినాబాద్‌ ఎమ్మెల్యే కొనుగోలు ఘటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయం భగ్గుమంది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రలోభపెట్టినట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం బీజేపీ పన్నిన కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్‌ అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియో వెల్లడికాగా, ఇప్పుడు మరో ఆడియో లీక్‌ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి. ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం.. పైలట్ రోహిత్‌రెడ్డి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు.

Moinabad Farmhouse Row: TRS MLA Rohith Reddy, Seer Ramachandra Bharathi's  Audio Call Viral

పైలట్‌కు ఒక రేటు, వెంట వచ్చేవారికి మరోరేటు ఇవ్వాలని, మునుగోడు పోలింగ్‌లోపు చేరితే వంద కోట్లు ఇవ్వాలని మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిలకు అంత ప్రాధాన్యం లేదని, ఈ అంశాలను నేరుగా సెంట్రల్‌ డీల్‌ చేస్తుందని చెప్పుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటున్నామని చర్చించుకున్నారు. ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్‌ షానే చూసుకుంటారని, రోహిత్‌ వెంట ముగ్గురు వచ్చేందుకు రెడీగా ఉన్నారని, చేవెళ్ల, కొడంగల్‌, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్‌ చేశామని, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందని వారు డిస్కస్‌ చేశారు. ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఈ సందర్భంగా నందు హామీ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news