హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్‌

-

ఎల్బీనగర్‌ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్‌ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. వనస్థలిపురం నుంచి వచ్చే వాహనాలు జంక్షన్‌ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ ఎక్కి నేరుగా ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ ముందు రోడ్డు దిగేలా వంతెనను నిర్మించారు. తుది దశ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఈ వంతెనపై వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. పెయింటింగ్‌, బీటీ మ్యాచింగ్‌ పనులు జరుగుతున్నాయి. నెలాఖరులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ వంతెనను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ సిగలో మెరిసేందుకు మరో ఫ్లైఓవర్‌ సిద్ధమౌతోంది. ఆరంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు నిర్మితమౌతోన్న ఈ ఫ్లైఓవర్‌ను ఈ ఏడాది మార్చ్‌ వరకు పూర్తి చేయాలని సీఎస్‌ సోమేశ్‌ శర్మ గతేడాది ఆదేశించారు. దీంతో గడువు దగ్గర పడుతుండగా పనులు
ఊపందుకున్నాయి.ఫ్లైఓవర్‌ను రూ. 636.80 కోట్ల అంచనాతో, మొత్తం 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. పనులు పూర్తి అయితే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే తరువాత రెండవ అతి పెద్దదైన ఫ్లైఓవర్‌ ఇదే అవుతుంది.ఈ ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ పూర్తి అయితే ఏయిర్‌పోర్ట్‌, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, అనంతపూర్‌, బెంగళూరు నుంచి వచ్చే వాహనదారులకు దూరాభారం గణనీయంగా తగ్గుతుందని అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news