ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో మా కుటుంబానికి సంబంధం లేదు – ఎంపీ మాగుంట

-

ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో మా కుటుంబానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఒంగోలు ఎంపీ మాగుంట. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇవాళ మీడియాకు వివరణ..ఇచ్చారు. లిక్కర్ స్కాంతో తన కుటుంబానికి సంబంధం లేదని… మా బంధువర్గం చేసే వ్యాపారాల్లో కూడా మాగుంట అనే పేరు ఉండటం వల్ల మాపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.

ఢిల్లీ 32 జోన్లలో వారు కేవలం 2 జోన్లలో మాత్రమే వ్యాపారం చేశారన్నారు.సీబీఐ విచారణ కూడా జరుగుతుంది..ఈడీ మా ఇళ్లు, కార్యాలయ సోదాల్లో వారికి అనుమానాలు నివృత్తి చేశామని స్పష్టం చేశారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని.. నేను ఏ వ్యాపారాల్లో కూడా భాగస్వామిని కాదని చెప్పారు. నా వ్యక్తిత్వంపై కావాలని దాడి చేశారు..రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తిరిగి పాత పాలసీ ప్రకారమే వ్యాపారం చేస్తుందని వెల్లడించారు ఒంగోలు ఎంపీ మాగుంట.

Read more RELATED
Recommended to you

Latest news