అయ్యో: వెయ్యి డోసుల వ్యాక్సిన్ నాశనం చేసేసిన అధికారులు

-

అస్సాంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ (ఎస్‌ఎంసిహెచ్) వద్ద కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అధికారులు నాశనం చేసారు. సుమారు 1,000 మోతాదుల వ్యాక్సిన్ నాశనం అయినట్టు గుర్తించారు. టీకాను ఎస్‌ఎంసిహెచ్‌ లోని వ్యాక్సిన్ స్టోర్ యూనిట్‌లో నిల్వ చేసినట్టు గుర్తించారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం… 1,000 మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని 100 కుండలలో ఉంచారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ ను 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సిల్చార్ మెడికల్ కాలేజ్ ,హాస్పిటల్‌ లో మైనస్ డిగ్రీలలో నిల్వ చేసారు. టీకాలు పాక్షికంగా గడ్డ కట్టుకుపోయాయి అని కాచర్ జిల్లాలోని ఒక ఆరోగ్య అధికారి తెలిపారు. ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్ (ILR) లో కొంత సాంకేతిక లోపం ఉండవచ్చు అని అధికారులు అన్నారు. మేము సాధారణంగా 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఐ ఎల్ ఆర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తామని అక్కడి అధికారి చెప్పారు.

ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, యంత్రం ఒక సందేశాన్ని పంపుతుంది అని… కానీ మా వ్యాక్సినేటర్‌ కు ఎటువంటి సందేశం రాలేదు అని అన్నారు. చాలావరకు ఇది సాంకేతిక లోపం అని వెల్లడించారు. టీకాలు రాత్రంతా నిల్వ ఉన్నా సరే సాంకేతిక లోపం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి అని తెలిపారు. దీనితో అస్సాం ఆరోగ్య శాఖ కోవిషీల్డ్ 100 కుండీల 1,000 బ్యాచ్లను సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌ కు పంపాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news