ప్రియురాలిని చంపి అడవిలోకి.. సూసైడ్ చేసుకున్నాడా ?

-

చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన గాయత్రి హత్య కేసు నిందితుడు ఢిల్లీ బాబు ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఢిల్లీ బాబు కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. తనను రహస్యంగా వివాహం చేసుకుని అనంతరం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో దూరం పెట్టిందన్న కోపంతో గాయత్రి అనే యువతిని ఢిల్లీ బాబు ఘోరంగా హత్య చేశాడు. అనంతరం ఢిల్లీ బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే యువతి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో ఢిల్లీ బాబు ఇంటి మీద దాడి చేశారు.

ఢిల్లీ బాబు తండ్రి మీద కూడా దాడి చేయడానికి యత్నించడంతో అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే యువతి హత్యలో ఢిల్లీ బాబు కుటుంబసభ్యులు ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు ఢిల్లీ బాబు పెనుమూరు అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. నిన్నటి నుంచి బయటికి కూడా రాకపోవడంతో బహుశా అక్కడ సూసైడ్ ఏమైనా చేసుకున్నాడేమో అని పోలీసులు భావిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news