ఎదుటి మనిషి సమస్యలు తీర్చలేం.. కనీసం ప్రేమిద్దాం.. సమంత

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్ల నుంచి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలకు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా సమంత పోస్ట్ చేసిన ఒక సందేశం ప్రస్తుతం వైరల్ గా మారింది..స్టార్ హీరోయిన్ సమంత సినీ కెరియర్ కొన్నాళ్లపాటు అద్భుతంగా గడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. అయితే ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని మానసికంగా కృంగిపోతున్నారు సమంత.. కొన్నాళ్లపాటు ప్రేమించుకొని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే..

Samantha Ruth Prabhu shares post about letting go and acceptance, two  months after split with Naga Chaitanya - Hindustan Times

ఆ తర్వాత తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ తో ఒకానొక సందర్భంలో ఎంతో ఇబ్బంది పడ్డారు సమంత. అలాగే ఈ పరిస్థితుల నుంచి బయటపడి మళ్లీ నటనపై తన పూర్తి ఏకాగ్రతను ఉంచుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితులు దాడి చేశాయి. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన అభిమానులతో పాటు సోషల్ మీడియా, సినిమాలకు సైతం దూరం అయ్యారు సమంత. పలు దేవాలయాలకు తిరుగుతూ తన ఆరోగ్యం పై పూజలు చేస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత ఒక పోస్ట్ ను ఉంచారు.. ఇందులో “ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు అందుకే అందర్నీ ప్రేమిద్దాం” అంటూ చెప్పుకొచ్చారు..

Samantha Prabhu's Upcoming Films: From Her Bollywood Debut With Taapsee  Pannu To Kushi and Others

ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..తాజాగా సమంత శాకుంతల చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉంది.. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడి ఏప్రిల్ 14న విడుదలవుతుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news