మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్ గా మనోజ్ బాజ్ పేయ్… సమంత, తమన్నాలు ఎన్నో స్థానంలో ఉన్నారంటే…

-

సిల్వర్ స్క్రీన్ కు ధీటుగా ఓటీటీలు దూసుకువస్తున్నాయి. నటులు తమ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. సినిమాలకు ధీటుగా వ్యూస్ దక్కించుకుంటున్నాయి. మీర్జాపూర్, ఫ్యామిలీమెన్, స్పెషల్ ఆప్స్ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రజానీకాన్ని కూడా ఓటీటీ దగ్గరైంది.

తాజాగా ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం… ఇండియాలో 2021గానూ మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్ గా మనోజ్ బాజ్ పేయ్ మొదటి స్థానంలో నిలిచారు. ఫ్యామిలీ మెన్1,2 వెబ్ సీరీస్ లతో మనోజ్ బాజ్ పేయ్ సంచలనం సృష్టించారు. తర్వాతి స్థానంలో పంకజ్ త్రిపాఠి నిలిచారు. మీర్జాపూర్ లో తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారు పంకజ్ త్రిపాఠి. ఫ్యామిలీ మెన్, మీర్జాపూర్ రెండు వెబ్ సీరీస్ లు తెలుగులో కూడా ప్రేక్షకులను అలరించాయి.

అయితే టాప్ టెన్ మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్లలో సమంత, తమన్నా కూడా నిలిచారు. ఫ్యామిలీ మెన్ 2 లో రాజీ పాత్రలో సమంత కీలక పాత్ర పోషించింది. సమంత ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. తమన్నా 11 అవర్ వెబ్ సీరస్ లో లీడ్ క్యారెక్టర్ పోషించింది. ఇందుకు గానూ తమన్నా 10 స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో వరసగా మనోజ్ బాజ్ పేయి, పంకజ్ త్రిపాఠి, నవాజుద్దీన్ సిద్దిఖీ, సమంత, రాధికా ఆప్టే, కేకే మీనన్, సైఫ్ అలీఖాన్, సుస్మీతా సేన్, జితేంద్ర కుమార్, తమన్నా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news