T20 World CUP 2022 : ఇండియా దెబ్బకు ఇంటిదారి పట్టిన పాక్ !

-

టీ20 వరల్డ్ కప్‌‌లో వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న భారత్.. కీలకమైన మూడో మ్యాచ్‌లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.ప్రోటీస్ విజయంతో పాకిస్తాన్ అనధికారికంగా t20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించినట్లే, టీమిండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కు ముందు నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన పాకిస్తాన్ ను ఆ సంతోషం ఒక్కరోజు కూడా మిగల్లేదు. సౌత్ ఆఫ్రికా పై టీమ్ ఇండియా గెలవాలని పాక్ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించలేదని చెప్పొచ్చు.

అయినా నెదర్లాండ్స్ ఆడిన తీరు చూశాక వాళ్ళు సెమీస్ కు వచ్చిన పెద్దగా ఉపయోగం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే నెదర్లాండ్స్ విధించిన 91 పరుగులు లక్ష్యాన్ని అందుకోవడానికి పాక్ నానా కష్టపడింది. మహమ్మద్ రిజ్వాన్ మిగతా వాళ్ళు పెద్దగా ఆకట్టుకోలేదు. టార్గెట్ చిన్నది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నెదర్లాండ్స్ కూడా పాకిస్తాన్ కు షాక్ ఇచ్చేది. ఇక ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం అందుకోవడంతో పాక్ కు సెమీస్ కు వెళ్లేదారులు దాదాపు మూసుకుపోయినట్లే. దీంతో పాకిస్తాన్ జట్టును టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోయారు క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం “బై బై పాకిస్తాన్” అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లిస్టులో చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news