పాకిస్తాన్ మహిళ: నేను ఇండియాలోనే జీవించాలనుకుంటున్నా … !

-

కొన్ని రోజులుగా ఒక విషయం బాగా వైరల్ అవుతోంది, ఇండియా కు చెందిన సచిన్ టైం పాస్ లో భాగంగా పబ్ జి ఆడుతూ ఉండేవాడు. అనుకోకుండా పబ్ జి ద్వారా పాకిస్తాన్ కు చెందిన సీమా పరిచయం అయ్యి అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇప్పుడు ఆమె నేను సచిన్ ను పెళ్లి చేసుకుని ఇండియాలోనే జీవించాలి అనుకుంటున్నానంటూ తెలిపింది. ఇందుకోసం నాకు భారతీయ పౌరసత్వం కావాలని కోరుకుంటోంది. ఇక ఇటీవల దీని కోసం ఈమె ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ లను కూడా రిక్వెస్ట్ చేశారట. ఈమె సచిన్ ను పెళ్లి చేసుకుని హిందూ మతాన్ని కూడా స్వీకరించింది. ఇప్పుడు ఇండియా పౌరురాలుగా గుర్తించాలని అడుగుతోంది. ఇందుకు కారణంగా పాకిస్తాన్ లో శాన్తభద్రతలతో పోలిస్తే మీ దేశంలో శాంతిభద్రతలు చాలా మెరుగ్గా ఉన్నాయంటూ తెలిపింది. అందుకే ఇక్కడ జీవించాలని ఆశపడుతున్నాను అంటూ తన కోరికను తెలిపింది.

ఇందుకు ఇండియా ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది ? ఆమెకు ఇక్కడ బ్రతికే హక్కును కల్పిస్తుందా ? ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news