పాన్-ఆధార్ అనుసంధానం.. గడుపు పెంచిన ఆదాయ పన్ను శాఖ

-

పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని చాలా రోజులుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ విషయమై ఎన్నో రోజులుగా గడువు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ పాన్ తో ఆధార్ లింక్ చేసుకోని వాళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు. పాన్ తో ఆధార్ అనుసంధానం అందరికీ రాలేదు. దాంతో ఆదాయ పన్ను శాఖ మరో మారు పాన్- ఆధార్ అనుసంధాన గడువును మరింత పెంచింది. 2022మార్చి 31వ తేదీ వరకు పాన్- ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 30వ తేదీతో పాన్- ఆధార్ లింకింగ్ సమయం ముగియాల్సి ఉంది. కానీ ఇంకా లింక్ చేసుకోని వాళ్ళ సంఖ్య భారీగా ఉండడంతో ఆదాయపన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పాన్ తో ఆధార్ అనుసంధానం పూర్తి కావాలని తెలిపింది. మరి ఇంకేం, మీ పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఇంకా పూర్తి కాలేదా? ఐతే వెంటనే లింక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news