రిషబ్ పంత్ కు బిగ్ షాక్.. T20 వరల్డ్ కప్‌కు కూడా దూరం?

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇటీవల కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, కారు ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, మరో 18 నెలల పాటు క్రికెట్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది.

పంత్, 2024 లో జరిగే టి20 వరల్డ్ కప్ కు కూడా దూరం కానున్నాడు. ‘పంత్ కీపర్ కాబట్టి, అతని ప్రతీ కదలికలు మోకాలిపై భారం వేస్తాయి. ఇప్పుడే ఇది సాధ్యం కాదు. అందుకు చాలా సమయం అవసరం’ అని వైద్య నిపుణులు తెలిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news