ఏపీలో పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్య

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మరో దారుణం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడలో పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్య గురైంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కాకినాడ లోని రంగరాయ వైద్య కళాశాలలో ఫస్ట్ ఇయర్ అనస్థీషియా డిప్లమో చదువుతోంది మృతురాలు. ఎప్పటి లాగే.. కాలేజీ వెళ్లే నేపథ్యం లో ఓ గుర్తు తెలియని వ్యక్తి … ఆమె పై కత్తితో దాడి చేశాడు.

దీంతో ఆ విద్యార్థి కత్తి పోట్లకు గురైంది. రక్త స్రావం బాగా కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది ఆ విద్యార్థి. దీంతో విద్యార్థి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిజిహెచ్ మార్చురీకి తరలించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ టుటౌన్ పోలీసులు. ప్రేమ నిరాకరించినందుకే హత మార్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.  అయితే.. హంతకుడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిబాటు అయినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news