రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. రైలు స్టేషన్లో ఉండగానే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

-

స్టేషన్ నుండి రైలు బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని భారతీయ రైల్వే అనుమతులు ఇచ్చింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని, అన్ని ప్రత్యేక రైళ్లకి ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. కోవిడ్ కంటే ముందు, స్టేషన్ కి రైలు చేరుకునే అరగంట ముందుగా సెకండ్ ఛార్ట్ రెడీ చేసుకునే వీలు ఉండేది. కానీ కోవిడ్ కారణంగా రెండు గంటల ముందుగా సెకండ్ ఛార్ట్ రెడీ చేస్తున్నారు.

మొదటి ఛార్ట్ మాత్రం నాలుగు గంటల ముందుగా ప్రిపేర్ అయ్యేది. ఐతే తాజాగా రైల్వే ప్రయాణీకుల సౌలభ్యం కోసం స్టేషన్ కి రైలు వచ్చే అరగంట ముందుగానే సెకండ్ ఛార్ట్ తయారు చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతంఈ వెసులుబాటులన్నీ నేటి నుండే అందుబాటులోకి వస్తాయట. కరోనా కారణంగా మార్చిలో ఆగిపోయిన రైళ్లన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news