టీడీపీ నేత పట్టాభి కార్ ధ్వంసం.. పక్కనే పోలీసులు ?

-

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కార్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆయన కారు ముందూ వెనుకా ఉన్న అద్దాలని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. ఇంటి బయట పెట్టిన కార్ ముందు, వెనుక అద్దాలని పగలగొట్టారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటన గురించి పట్టాభి మాట్లాడుతూ నా నివాసం బయట ఉన్న నా కారును ధ్వసం చేశారని, వైసీపీ అవినీతిని బయట పెడుతున్న అని నా కారుని ధ్వసం చేశారని అన్నారు. నా నివాసం పక్కన హైకోర్టు జడ్జి నివాసం ఉంది…అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా నా కారుని ధ్వసం చేశారని ఆయన అన్నారు. కారు ధ్వంసం చేసినంత మాత్రాన బయపడనన్న ఆయన తానేమీ పిరికిపందను కాదని అన్నారు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకువచ్చి కారు పగలగొట్టారన్న ఆయన నా నోరు మూయించాలి అని చూస్తే… నేను బయపడనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news