‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పంద‌న‌.. ర‌క్తం మ‌రిగిపోతోందంటూ..

-

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. హత్యాచార ఘటన జరిగిన రాత్రి ఆ నలుగురు పోకిరీల మధ్య ‘దిశ’ ఎంత నరకాన్ని అనుభవించిందో తలచుకుంటేనే తనలో ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఆయన స్పందిస్తూ ప్రకటన చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దని, మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలిపెట్టకూడదని అన్నారు.

దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసుల్లో ఇలాంటి కేసుల్లో కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని, కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని పవన్ అభిప్రాయపడ్డారు. మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అమ్మాయిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాలని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news