మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించిన పవన్..

-

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు పలువురు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.

ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని… కానీ, తెలుగును మాతృ భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. ‘జగన్ రెడ్డి గారు, ‘మా తెలుగు తల్లికి’ అంటూ పాడాల్సిన మీరు… తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాష సరస్వతిని అవమానించకండి అని చెప్పారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీంతో పాటు, పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news