పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం నల్గొండలోని సూర్యపేట జిల్లా కోదాడలో జనసేన కార్యకర్తకి ఆర్థిక సహాయం చేయడానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరాబండం వల్ల జనసేన కాన్వాయ్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Road-Accident
Road-Accident

బాధితులు కూచిపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నాయబ్ రసూల్, అరవింద్ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అరవింద్ కాలు ఫ్యాక్చర్ అవ్వగా.. నాయబ్ రసూల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వారిద్దరిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news