‘ఎవడ్రా నన్ను కొట్టింది’ అంటున్న వర్మ..!

-

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో దర్శకుడు ఆర్జీవీపై ‘ఎవడ్రా నన్ను కొట్టింది’ అనే చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేసారు. సినీ లవర్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు నీలకంఠం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తనని కొట్టింది ఎవరో తెలియక 6 నెలల పాటు ఆర్జీవీ పడిన సంఘర్షణే ఈ సినిమా కథాంశంగా పేర్కొన్నారు. త్వరలోనే సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే వర్మ ఎప్పుడైతే ‘పవర్‌స్టార్’ అనే సినిమాను ప్రకటించాడో.. అప్పటి నుంచి అతనిపై ఓ చిన్నపాటి యుద్ధమే మొదలైంది. దీంతో దానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు వర్మపై సెటైరికల్‌గా ఓ నాలుగైదు చిత్రాలను ప్రకటించేశారు. కాగా, ‘పవర్‌స్టార్’ తో సహనం కోల్పోయిన పవన్ అభిమానులు వర్మ పై దాడికి కూడా దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news