ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.. మరోసారి పవన్‌ ఫైర్‌

-

ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ జాబితాల అంశంలో వాలంటీర్ల జోక్యం ఏంటని జనసేనాని మండిపడ్డారు. ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్టవిరుద్ధమని పవన్‌ స్పష్టం చేశారు.

Aggressive JanaSena Party Pawan Kalyan

ఓటర్ల తనిఖీకి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు పవన్ కల్యాణ్. వైసీపీ బూత్ లెవల్ ఆఫీసర్లతో కలిసి వాలంటీర్లు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కోరుతోందని డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news