పవన్ సిగ్నల్..ఇక బీజేపీకి దూరమే..!

-

తాజాగా పవన్ విశాఖ పర్యటనలో అనుహ్యా సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే..జనవాణి కార్యక్రమానికి వచ్చిన పవన్‌కు పోలీసులు బ్రేకులు వేశారు. అలాగే మంత్రులపై దాడి చేశారని కొంతమంది జనసేన నేతలని, కార్యకర్తలని అరెస్ట్ చేశారు. ఇక వారిని వదిలేవరకు పవన్ విశాఖ వదలలేదు. అందులో కొందరిని వదిలేశాక పవన్ విశాఖ వదిలి..విజయవాడ వచ్చారు..అలాగే వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు.

ఇక తాజాగా మంగళగిరిలో జనసేన కార్యలయంలో ఆ పార్టీ శ్రేణులతో సమావేశమై..వైసీపీ టార్గెట్‌గా పవన్ నిప్పులు చెరిగారు. ఎప్పుడు సమన్వయంతో ఉంటూ..పరుష పదజాలం వాడని పవన్..ఊహించని విధంగా వైసీపీ గూండాలు, సన్నాసులు, వెదవలు అంటూ ఫైర్ అయ్యారు. తనని ప్యాకేజ్ స్టార్ అంటూ చెప్పుతీసి కొడతానని ఘాటుగా మాట్లాడారు. ఇంకా ఊహించని విధంగా “ఒరెయ్ వెధవల్లారా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకురా? మీలా ఒక పెళ్ళి చేసుకుని 30 స్టెఫ్నీలతో తిరగడం లేదు’ అని ‘ఒంటి చేత్తో మెడ పిసికి చంపేస్తా నా కొడకల్లారా’ అని పవన్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్‌లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం’ అంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి పవన్ తన ఫైర్ అంతా బయటపెట్టారు. ఇదే సమయంలో పవన్..బీజేపీతో పొత్తు విషయం కూడా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ ఇంతవరకు రూట్ మ్యాప్ ఇవ్వలేదని, కాలం గడిసిపోతుందని, ఇక తాను కూడా వ్యూహాలు మార్చుకుంటానని,  అలా అని మోదీ, అమిత్ షాలపై తనకు గౌరవం ఉందని, బీజేపీ పట్ల గౌరవం ఉందని…తాము ఎప్పుడైనా కలుస్తూనే ఉంటామని అన్నారు.

దీని బట్టి చూస్తుంటే బీజేపీతో పొత్తుకు పవన్ గుడ్ బై చెప్పినట్లే కనిపిస్తోంది..ఇంకా సింగిల్‌గా పవన్ పోరాటం మొదలయ్యేలా ఉంది. మరి ఎన్నికల సమయంలో టీడీపీతో గాని కలిసే ఉద్దేశం ఉండబట్టే, ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? అనే డౌట్ కూడా వస్తుంది. మరి చూడాలి పవన్ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news