ఆయన మరణం తీరనిలోటు : పవన్ కళ్యాణ్

-

విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జయప్రకాష్ రెడ్డి మరణంపై స్పందించారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి తన తరుఫున, జనసేన తరుఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాష్‌ రెడ్డి చూపారన్నారు. ఆయన మరణం తెలుగు సినీ, నాటక రంగానికి మాత్రం మరువలేని లోటు అని పవన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news